నేరేడుచర్ల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల మండలం పరిధిలోని అడవి గ్రామ పంచాయతీ ఆదర్శ్ నగర్ వద్ద ఆదివారం తెల్ల వారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన మెడికల్ విద్యార్థి బీరవో లు శ్రీనిధిరెడ్డి(21) అక్కడికక్కడే మృతి చెందాడు.
విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో చదువుకుంటున్న శ్రీనిధిరెడ్డి తన స్నేహితులు మరో ఏడుగురితో కలిసి ఫార్చునర్ కారులో సూర్యలంక బీచ్కు వెళ్లి వస్తుండగా మూలమలుపు వద్ద విద్యుత్ స్తంభాన్నిఢీ కొట్టారు. దీంతో కారు పల్టీ కొడుతూ వెళ్లి పక్కనే ఉన్న పెద్ద కాల్వలో పడిపోయింది. పక్కనే ఉన్న జాలర్లు వెంటనే స్పందించి వీరిలో 7 గురిని రక్షించి ఒడ్డుకు చేర్చారు.
శ్రీనిధిరెడ్డి మాత్రం కారులోనే మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని బాపట్ల ప్రభుత్వ దవాఖానకి తరలించి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. బాపట్ల సీఐ శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. ప్రమా దంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని విజయవాడలోని దవాఖానకు తరలించారు. మరో నాలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
నేరేడుచర్లలో విషాధం
శ్రీనిధిరెడ్డి అమ్మమ్మగారి ఊరు నేరేడుచర్ల కావడంతో తరుచూ ఇక్కడకీ వస్తుండేవాడు. ఇతడి తండ్రి గరిడేపల్లి, దామర చర్ల, మిర్యాలగూడ ట్రాన్స్కో ఏఈగా పని చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్లో ఏడీఈగా సేవలందిస్తున్నాడు. శ్రీనిధిరెడ్డి మృతి విషయం తెలియడంతో నేరేడుచర్లలో విషాధఛాయలు అలుముకున్నాయి. నేడు మిర్యాలగూడ మండలంలోని తడక మళ్లలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.