సూర్యాపేట : కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడి మహిళా కూలీ మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం దిక్కుమళ్ల గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది.
మృతి చెందిన మహిళలను లింగమ్మ (40)గా పోలీసులు గుర్తించారు. వీరంతా కూలీ పనుల నిమిత్తం మహబూబాబాద్ జిల్లాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికులు సూర్యాపేట జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి