మఠంపల్లి: దేవుడి దయ ప్రతీ ఒక్కరిపై ఉండి ప్రజలందరూ సుఖఃశాంతులతో జీవించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మొహర్రంను పురస్కరించుకుని శుక్రవారం తన స్వగ్రామం గుండ్లపల్లిలో అర్ధరాత్రి పీర్లచావిడి వద్ద పెద్ద ఎత్తున వేడుక నిర్వహించారు. సరిగెత్తులను దర్శించుకుని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. కార్యక్రమంలో గ్రామ ముస్లిం మత పెద్దలు, టీఆర్ఎస్ నాయకులు గుండా బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
మండల కేంద్రంలో విద్యుత్ఘాతంతో చనిపోయిన కామళ్ళ రాములు, ఫర్టిలైజర్ వ్యాపారి రాతికింది సైదులు మాతృమూర్తి చనిపోవడంతో వారి కుటుంబాలను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి శుక్రవారం పరామర్శించారు. వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కొండా నాయక్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి వల్లపుదాసు బాలకృష్ణ, సురేశ్, ఉపసర్పంచ్ జాలకిరణ్, నాయకులు మన్నెం శేషిరెడ్డి, కొండేటి సుధాకర్రెడ్డి పాల్గొన్నారు