కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
మునగాల/ నడిగూడెం, జూలై 28 : పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా రేషన్కార్డులను మంజూరు చేస్తున్నదని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. బుధవారం మునగాల మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఆవరణంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైరవీలు, కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా పేదలకు రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నదని తెలిపారు. తాసీల్దార్ కృష్ణ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రమీలాశ్రీనివాస్, ఎంపీపీ బిందు, సర్పంచ్ ఉపేందర్, జిల్లా పౌరసంబంధాల అధికారి విజయలక్ష్మి, ఆర్డీఓ కిశోర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధారాణి పాల్గొన్నారు. అదేవిధంగా నడిగూడెం మండల కేంద్రంలో కొత్త రేషన్ కార్డులను ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ పంపిణీ చేశారు. ఎంపీపీ జ్యోతీమధుబాబు, జడ్పీటీసీ కవితానాగరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సిరెడ్డి పాల్గొన్నారు.