మెదక్ మున్సిపాలిటీ, జూలై 7 : హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి, హరితహారంలో భాగంగా మెదక్ మున్సిపాలిటీ 12వ వార్డులోని పిల్లికోటాల్లో మెదక్ కలెక్టర్ హరీశ్, జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం 11వ వార్డులో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, వార్డు కౌన్సిలర్ సమియొద్దీన్తో కలిసి రూ.5లక్షలతో చేపట్టే సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రసీదు కాలనీలో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. మహిళలు, చిన్నారులకు పూలు, ఔషధ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ జాబీద్ జన్మదినం సందర్భంగా కేక్ కట్చేసి తినిపించారు. అనంతరం మెదక్ కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే సమయంలో రోడ్డు వెడల్పును దృష్టిలో ఉంచుకోని నాటాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, మున్సిపల్ కౌన్సిలర్లు అకిరెడ్డి కృష్ణారెడ్డి, ఆర్కే శ్రీనివాస్, కిశోర్, జయరాజ్, లక్ష్మీనారాయణగౌడ్, జిల్లా రైతు బంధు సమితి సభ్యుడు చింతల నర్సిం హులు, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, మున్సిపల్ డీఈ మహేశ్, ఏఈలు బాలసాయగౌడ్, సిద్దేశ్వరి, శానిటరీ ఇన్స్పెక్టర్ వనిత, టీపీఎస్ లక్ష్మీపతి, వర్క్ ఇన్స్పెక్టర్లు సలీం, దుర్గపతి, మెప్మా జిల్లా కోఆర్డినేటర్ ఇందిర, మెప్మా పీఆర్సీ సునీత, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గంగధార్, కృష్ణాగౌడ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.