దుండిగల్, జూన్ 22 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బాచుపల్లి, మల్లంపేట, శంభీపూర్, బౌరంపేట ప్రాంతాల్లో భవిష్యత్లో ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జంక్షన్లు, రోడ్ల వెడల్పుకోసం ప్రభుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టనుందని ఎమ్మెల్యే వివేకానంద్, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు అన్నారు. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం జంక్షన్ల అభివృద్ధి, రోడ్డు వెడల్పు పనుల ప్రతిపాదనల్లో భాగంగా హెచ్ఎండీఏ, ఆర్అండ్బీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మంగళవారం ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నిజాంపేట నుంచి బాచుపల్లి వరకు రోడ్డు వెడల్పు, జంక్షన్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అదేవిధంగా మల్లంపేట పరిధిలోని రోడ్డుకు మార్కింగ్చేసి హెచ్ఎండీఏకు అప్పగించాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. అలాగే శంభీపూర్ నుంచి బౌరంపేటలోని బొడ్రాయి వరకు చేపట్టాల్సిన రోడ్డు వెడల్పు పనులపై అధికారులంతా సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. మల్లంపేట గ్రామ సమీపంలోని ఔటర్రింగ్ రోడ్డు 4,5 ఎగ్జిట్ల మధ్య ఎంట్రీ, ఎగ్జిట్ పనుల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధికి సహకారం అందిస్తూ పెండింగ్లో ఉన్న పనులను వేగంగా పూర్తిచేసేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్న మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
హెచ్ఎండీఏ ఈఈ అప్పారావు, డీఈ దీపక్కుమార్, ఆర్అండ్బీ డీఈ రాజు, ఏఈ ధరణీధర్రెడ్డి, డీఈ సుబ్రమణ్యం, దుండిగల్ మున్సిపాలిటీ కమిషనర్ పి.భోగీశ్వర్లు, నిజాంపేట డిప్యూటీ మేయర్ ధన్రాజ్, బౌరంపేట పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్రెడ్డి, కార్పొరేటర్లు విజయలక్ష్మి, ఆగంపాండు ముదిరాజ్, కొలన్ వీరేందర్రెడ్డి, కౌన్సిలర్లు శంభీపూర్కృష్ణ, శంకర్నాయక్, మాదాసు వెంకటేశ్, అర్కల అనంతస్వామి, కో-ఆప్షన్ సభ్యుడు సయ్యద్ సలీం, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కొలన్ గోపాల్రెడ్డి, మురళీ యాదవ్, ఆంజనేయులు పాల్గొన్నారు.