కరోనా ఎఫెక్ట్ నుంచి కోలుకోలేని పరిస్థితిలో ఉంది సినీ పరిశ్రమ. ఫస్ట్ లాక్డౌన్ తర్వాత మధ్యలో కొన్ని రోజులు ఓపెన్ అయిన థియేటర్లు మళ్లీ కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్తో మూతపడ్డాయి. ఇపుడు లాక్ డౌన్ నుంచి రిలాక్సేషన్ లభించినా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి. కొత్త సినిమాలు ప్రేక్షకుల ముందుకు ఎప్పుడొస్తాయో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి టైంలో హీరోల రెమ్యునరేషన్ విషయం మాత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోతుంది.
ఇప్పటికే టాలీవుడ్ యువ హీరో వరుణ్ తేజ్ రూ.12 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా మాస్ మహారాజా రవితేజ తీసుకుంటున్న రెమ్యునరేషన్ పై అందరూ తెగ చర్చించుకుంటున్నారు. రవితేజ ప్రస్తుతం రూ.17 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
క్రాక్ సక్సెస్ తర్వాత జోరు మీదున్న రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సంతకం చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే రమేశ్ వర్మ, త్రినాథరావునక్కిన, శరత్ మండవతో సినిమాలు లైన్లో పెట్టాడు. అయితే ఇవి కాకుండా కొత్తగా చేయబోయే సినిమాలకు రూ.17 కోట్లు పారితోషికం ఇవ్వాలని నిర్మాతలను డిమాండ్ చేస్తున్నాడట రవితేజ.
ఇవి కూడా చదవండి..
రాజా విక్రమార్క టైటిల్తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
Recommended Content by ntnews.com