టాలీవుడ్ లో పాన్ ఇండియా ప్రాజెక్టుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప చిత్రంపైనే అందరి ఫోకస్ పడ్డది. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు పార్టులుగా రానుందని ఫిల్మ్ మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుపై ఇలాంటి వార్తలే తెరపైకి వస్తున్నాయి.
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం సలార్. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతుందన్న వార్త ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. సలార్ ను మరింత ప్రమోట్ చేయడంలో భాగంగా ఇలాంటి గాసిప్ వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి మేకర్స్ రాబోయే కాలంలో సలార్ పై అప్ డేట్ ఇస్తే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఇవి కూడా చదవండి..
రాజా విక్రమార్క టైటిల్తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
Recommended Content by ntnews.com