వికారాబాద్ : కల్యాణలక్ష్మిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో లబ్ధిదారులకు రూ.1,12,12,992.విలువ గల 112 కల్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేద కుటుంబాలలో తమ కూతురి వివాహం చేయడంలో ఆర్థిక సాయం చేసేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి గొప్ప ఆదర్శవంతమైన పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.
స్వాతంత్రానంతరం దేశంలో చాలా మంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులను చూశాం. కానీ ఏ ఒక్కరు కూడా పేద కుటుంబాలలోని ఆడపిల్ల వివాహానికి ఆర్థిక సహాయం చేయాలని అనుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ మాత్రమే ఇటువంటి ఆలోచన చేసి ఒక ఆదర్శవంతమైన పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ, జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి, ఏఎంసీ చైర్మన్ విజయ్ కుమార్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కమాల్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనుల పరీశీలన
సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లు పూర్తి : మంత్రి ఎర్రబెల్లి
ఒకరికి తెలియకుండా ఇంకొకరిని.. ఆరుగురిని పెండ్లాడిన దొంగ బాబా