శ్రీశైలం : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు మరికాసేపట్లో శ్రీశైల మల్లికార్జుడిని దర్శించుకోనున్నారు. ఈ ఉదయం 5 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన 9 గంటలకు శ్రీశైలం దేవస్థానం అతిథి గృహానికి చేరుకున్నారు. సీజేఐ దంపతులకు అతిథి గృహం వద్ద ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తోపాటు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఆలయం వద్ద అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామిఅమ్మవార్ల దర్శనం చేయించేందుకు ఆలయంలోకి తీసుకెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం 10 గంటల 30 నిమిషాలకు తిరిగి ఎన్వీ రమణ దంపతులు హైదరాబాద్ చేరుకుంటారు. సీజేఐ పర్యటన నేపథ్యం ఆలయం వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటీవలే ఆయన తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న విషయం తెలిసిందే.