న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్)లో ట్రేడ్ అప్రెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తులు వచ్చేనెల 15 లోపు పంపిచాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాల్లోని 121 పోస్టులను భర్తీ చేయనుంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఎంపికైనవారు గుజరాత్లోని గాంధీనగర్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 121
ఇందులో ఎలక్ట్రిషన్ 32, ఫిట్టర్ 32, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 12, ఎలక్ట్రానిక్ మెకానిక్ 12, పాసా, వెల్డర్, టర్నర్ 7 చొప్పున, మెషినిస్ట్ 6, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ 6 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి. 14 నుంచి 24 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక విధానం: ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను పూర్తిగా నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: Nuclear Power Corporation of India Limited, Anumala-394651, Ta. Vyara, Dist. Tapi, Gujarat
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 15
వెబ్సైట్: https://www.npcil.nic.in/