ఐసొలేషన్లో ఉన్న 18 ఏళ్లలోపు పిల్లలకు న్యూట్రిషన్ కిట్స్
కలెక్టర్ కే శశాంక
విద్యానగర్, జూన్ 8: కొవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల సంరక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ కే శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మహిళా శిశు సంక్షేమశాఖ, బాలరక్షక భవన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యాశాఖ అధికారులతో అనాథ చిన్నారుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కొవిడ్ బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలన్నారు. పిల్లలను పాఠశాలలో చేర్పించాలని, ఉపకార వేతనం, రైతు బీమా, రైతుబంధు, ఆస్తుల బదిలీకి న్యాయ సహాయం అందించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల్లో, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న అనాథ బాలల వివరాలు బాల రక్షక భవన్ అధికారికి అందించాలన్నారు. కొవిడ్తో తల్లిదండ్రులిద్దరిని, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన పిల్లల వివరాల సేకరణకు టాస్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని మహిళా శిశు సంక్షేమాధికారి, బాల రక్షక భవన్ కో-ఆర్డినేటర్లను ఆదేశించారు. కొవిడ్ బారిన పడి ఐసొలేషన్లో ఉన్న 18 ఏళ్లలోపు పిల్లలకు న్యూట్రిషన్ కిట్లు అందించాలని ఆదేశించారు. జిల్లా సంక్షేమాధికారి శారద మాట్లాడుతూ, జిల్లాలో 248 మంది అనాథ చిన్నారులను గుర్తించినట్లు తెలిపారు. ఇందులో కరోనాతో తల్లిదండ్రులిద్దరిని కోల్పోయిన వారు ఆరుగురు, తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన 157 మంది ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో బాల రక్షక భవన్ కో-ఆర్డినేటర్ సరస్వతి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుడు నతానీయల్, జిల్లా బీసీ సంక్షేమాధికారి రాజమనోహర్, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి మధుసూదన్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి గంగారాం, జిల్లా విద్యాశాఖ సంచాలకురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు.
కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలి
జిల్లాలో కొవిడ్ బాధితుల కుటుంబసభ్యులందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని కలెక్టర్ శశాంక వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన వైద్యాధికారులతో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్, ఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటుపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ వచ్చిన వారి కుటుంబసభ్యులందరికీ మొబైల్ బృందాల ద్వారా పరీక్షలు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఐదు కంటే ఎకువ పాజిటివ్ కేసులు ఉంటే ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో చేర్పించాలన్నారు. మండల టాస్క్ఫోర్స్ బృందాలు పాజిటివ్ వచ్చిన వారి ఇంటికి వెళ్లి ప్రత్యేక గదిలో ఉంటున్నారా లేదా అనేది పరిశీలించాలని, వసతులు లేకుంటే ఐసొలేషన్ కేంద్రానికి తరలించాలన్నారు. జిల్లాలో హైరిస్ గ్రూప్ వారికి నిర్వహిస్తున్న ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద రద్దీ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం హైరిస్ గ్రూపులో మెడికల్ షాపులు, వైకుంఠధామాల్లో పనిచేసే వారిని కూడా చేర్చిందని, వారికి కూడా వ్యాక్సిన్ వేయాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కువ మంది ఉన్నందున మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కమిషనర్ను ఆదేశించారు. రెండో విడుత జ్వర సర్వే పూర్తయిన తర్వాత లక్షణాలున్న వారికి ఆరోగ్య పరీక్షలు చేసి, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభుత్వ దవాఖానకు పంపించాలని సూచించారు. టెలీకాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, డీఎంహెచ్వో డాక్టర్ జువేరియా, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సాజిదా, డిప్యూటీ డీఎంహెచ్వోలు డాక్టర్ సుధాకర్రెడ్డి, డాక్టర్ స్వాతి, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ రవీందర్రెడ్డి, డాక్టర్ నాగశేఖర్, రాజగోపాల్ పాకొనుగోళ్లలో మంథని పీఏసీఎస్ రికార్డుల్గొన్నారు.