Suryapet
- Dec 03, 2020 , 02:32:29
రెడ్లకుంటలో ఇసుక డంప్లపై అధికారుల విచారణ

కోదాడ రూరల్: మండలంలోని రెడ్లకుంట గ్రామంలో 500 ట్రక్కుల ఇసుక డంపింగ్ అంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు స్పందించిన తాసీల్దార్ జె.శ్రీనివాసశర్మ, పంచాయతీరాజ్ డీఈ, ఏఈ లక్ష్మారెడ్డి, రూరల్ ఎస్ఐ వై. సైదులు బుధవారం గ్రామాన్ని సందర్శించి ఇసుక డంప్లను పరిశీలించారు. గ్రామంలో 67 ట్రక్కుల ఇసు క, పలువురి ఇండ్ల వద్ద 32 ట్రక్కుల ఇసుకను గుర్తించారు. గ్రామంలో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైన్లు, డంపింగ్యార్డ్, శ్మశానం, ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి నిమిత్తం పీఆర్ డీఈ వద్ద నుంచి 60 ట్రిప్పులకు 45 ట్రిప్పులకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. అదనంగా ఉన్న 39 ట్రిప్పుల్లో గృహనిర్మాణాలకు పోను మిగిలిన 20 ట్రక్కుల ఇసుకను సీజ్ చేసినట్లు తెలిపారు.
తాజావార్తలు
- తెలంగాణ సూపర్
- ఈడబ్ల్యూఎస్ కోటాతో సమతూకం
- మేధోకు 2211 కోట్ల కాంట్రాక్టు
- 18 దేశాల్లో టిటా కమిటీలు
- టీజీటీఏ ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్
- 25 నుంచి పీజీ ఈసెట్ స్పెషల్ కౌన్సెలింగ్
- ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
- 24, 25న ఈఎస్సీఐ ఎంబీఏలో స్పాట్ అడ్మిషన్లు
- గిరిజనుల ఆర్థికాభివృద్ధే ఐటీడీఏ లక్ష్యం
- ఓయూ దూరవిద్య డిగ్రీ ఫలితాలు
MOST READ
TRENDING