న్యూఢిల్లీ : ఔషధ తయారీ దిగ్గజాలైన రోచె ఇండియా, సిప్లా కంపెనీలు భారతదేశంలో యాంటీబాడీస్ కాక్టెయిల్స్ను విడుదల చేశాయి. ఇవి కరోనా వైరస్ను నియంత్రించడంలో ఉపయోగపడతాయని రోచె-సిప్లా కంపెనీలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఈ ఔషధం ఒక డోసు ధర రూ.59,750 లు. ‘యాంటీబయాటిక్ కాక్టెయిల్ (కాసిరివిమాబ్, ఇమ్దేవిమాబ్) ఇప్పుడు భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. జూన్ మధ్య నాటికి ఈ ఔషధం మన దేశానికి చేరుకోగలదు. మొత్తంగా ఇది 2,00,000 మంది కరోనా సోకిన రోగులకు చికిత్స చేయగలదు. 1,00,000 ప్యాక్ల ప్యాక్తో ఇద్దరు రోగులకు చికిత్స అందించవచ్చు.
రోచె-రెజెనెరాన్ చేత అభివృద్ధి చేయబడిన ఈ కాక్టెయిల్ ఔషధమైన కాసిరివిమాబ్, ఇమ్దేవిమాబ్ భారతదేశంలో అత్యవసర ఉపయోగం కోసం ఆమోదించబడ్డాయి. కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో ఈ యాంటీబాడీ ఔషధానికి సంబంధించిన డాటాను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) తనిఖీ చేసిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని అత్యవసర వినియోగం యూఎస్లో కూడా ఆమోదించబడింది.
ఈ ఔషధం (కాసిరివిమాబ్ 600 మి.గ్రా, ఇమ్దేవిమాబ్ 600 మి.గ్రా) కలిపి మోతాదు 1,200 మి.గ్రా., ప్రతి రోగికి రూ.59,750 ధర. ఈ ఔషధం మల్టీడోస్ ప్యాక్ ధర రూ.1,19,500. అందిన సమాచారం ప్రకారం, ఈ ఔషధం అన్ని ప్రధాన దవాఖానలు, కొవిడ్ చికిత్సా కేంద్రాలలో లభిస్తుంది.
సహజంగా బరువు తగ్గేందుకు ఈ పండ్లు తినండి..!
క్వారంటైన్లో పాక్లోని ఇండియన్ ఎంబసీ అధికారులు
అజ్మీర్లో పెద్ద ఎత్తున నిషేధిత మందులు పట్టివేత
కొవిడ్ అంటే అంటువ్యాధే కాదు.. ఓ సంస్థ పేరు కూడా..!
తొలిసారిగా చిన్ని గుండెను సృష్టించిన శాస్త్రవేత్తలు
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
డబ్ల్యూటీసీ పేలుడు కేసులో నలుగురికి 240 ఏండ్ల జైలుశిక్ష.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..