ఇసుక తరలింపుపై వివాదం

కోదాడ రూరల్: పాలేరు వాగు నుంచి ఇసుక తరలింపు పోలీసులు, రెడ్లకుంట గ్రామస్తులకు మధ్య వివాదంగా మారింది. మండలంలోని రెడ్లకుంట గ్రామానికి చెందిన రైతు ఇంటి పనుల నిమిత్తం పాలేరు వాగు నుంచి ట్రాక్టర్తో ఇసుకను తరలిస్తుండగా అనుమతులు లే కుండా తరలించొద్దంటూ పోలీసులు అడ్డుకోవడంతో వివాదం ఏర్పడింది. గ్రామ సర్పం చ్ వందల ట్రక్కుల ఇసుక తరలిస్తున్నా పట్టించుకోని వారు తమ ఇంటి పనులకు ఇసుక తోలుకుంటే పట్టుకోవడం అన్యాయమని పోలీసులతో వాగ్వాదానికి దిగి రోడ్డుపై బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ సైదులు గ్రామానికి చేరుకుని ఇసుక తరలింపుపై సమగ్ర విచారణ చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని సర్ధి చెప్పారు. అనం తరం పాలేరు వాగు నుంచి ఇసుకతో వస్తున్న ట్రాక్టర్పై కేసు నమోదు చేశారు.
అనుమతితోనే ఇసుక తరలింపు
గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు రెవెన్యూ అధికారుల అనుమతులతోనే ఇసుక తరలిస్తున్నామని సర్పంచ్ సాధినేని లీలా తెలిపారు.
తాజావార్తలు
- దేశానికే ఆదర్శం సూర్యాపేట మున్సిపాలిటీ: మంత్రి జగదీష్రెడ్డి
- పశ్చిమ గోదావరిలో అంతుచిక్కని వ్యాధి కలకలం..
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- కొనసాగుతున్న పెట్రో బాదుడు.. రూ.93 దాటిన పెట్రోల్ ధర
- బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది విడత కౌన్సెలింగ్
- మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు?
- శ్రీమతికి మహేష్ బర్త్డే విషెస్.. పోస్ట్ వైరల్
- రేపు బెంగాల్, అసోంలో ప్రధాని పర్యటన
- ఈ ఫొటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..!
- 20 తీర్మానాలను ఆమోదించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ