కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం అలుముకుంది. ఆమె సోదరుడు ఆషీమ్ బెనర్జీ కరోనా మహమ్మారి బారినపడి కన్నుమూశారు. ఆషీమ్ బెనర్జీ కోల్కతాలోని మెడికా హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. ఇటీవల కరోనాతో ఆయన హాస్పిటల్లో చేరగా.. పరిస్థితి విషమించి మృతి చెందారని ఆసుపత్రి చైర్మన్ అలోక్రాయ్ పేర్కొన్నారు. కరోనా నిబంధనల మధ్య మధ్యాహ్నం అంత్యక్రియలు నిమ్తలా మహా శ్మశాన్ ఘాట్లో జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.