మహబూబ్నగర్, మే 14 : బహుజన వర్గాలను రా జ్యాధికారానికి చేరువ చేసిన దార్శనికుడు బసవేశ్వరుడని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం బసవ జయంతిని పురస్కరించుకుని మహబూబ్నగర్ జి ల్లా కేంద్రంలోని బసవేశ్వరుడి విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటి సమాజంలో పేరుకుపోయిన కుల వ్యవస్థను నిర్మూలించడానికి మనుషులందరూ ఈశ్వరుడి దృష్టిలో సమానమేనని వీరశైవ లింగాయత్ ధర్మాన్ని స్థాపించి స హపంక్తి భోజనాలను ఏర్పాటు చేయడమే కాకుండా కుల వ్యవస్థ నిర్మూలనకు శ్రమించారని గుర్తుచేశారు. శతాబ్దాల కిందటే సమసమాజ స్థాపనకు కృషి చేశారని పేర్కొన్నారు. బసవేశ్వరుడి ఆశయ సాధనకు కంకణబద్ధులై పనిచేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు తదితరులు ఉన్నారు.
అందరికీ సముచిత స్థానం..
కులమతాలకతీతంగా రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నామ ని మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని గ్రీన్బెల్ట్లో మహమాయ గౌ తమ బుద్ధవిహార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని కులాల వారికి సముచిత స్థానం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు, సం ఘం నేతలు, తదితరులు పాల్గొన్నారు.
లాక్డౌన్ నిబంధనలు పాటించాలి..
జడ్చర్ల, మే 14 : లాక్డౌన్ నిబంధనలను ప్రతి ఒ క్కరూ విధిగా పాటించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ సూ చించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల పట్టణంలో శుక్రవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లి లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు. రోడ్డుపై వెళ్తున్న కారును ఆపి రోడ్లపై ఎందుకు తిరుగుతున్నారని డ్రైవర్ను ప్రశ్నించారు. లాక్డౌన్ సమయంలో బయటకు రావొద్ద ని సూచించారు. వారి వెంట జెడ్పీ వైస్ చైర్మన్ యాద య్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, నాయకులు మురళి, ఇమ్మూ తదితరులు పాల్గొన్నారు.
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు..
మహబూబ్నగర్ టౌన్, మే 14 : రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలకు మంత్రి శ్రీనివాస్గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన ముస్లింలకు అల్లా కటాక్షం ఎల్లవేళలా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కరోనా మహమ్మారి నుంచి బయటపడాలని అల్లాను కోరానన్నారు.