మేడ్చల్ కలెక్టరేట్,మే 11: కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్ సూచించారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని వికాస్నగర్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డితో కలిసి అదనపు కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిషీల్డ్ మొదటి డోసు తీసుకొని 42రోజులు దాటిన వారు రెండో డోసు తీసుకునేందుకు అర్హులన్నారు. మొదటి డోసు ఎక్కడ తీసుకున్నప్పటికీ వారి ఆధార్, మొదటి డోసు రోజున నమోదు చేసుకున్న ఫోన్నంబర్తో సంప్రదించి రెండో డోసును ఎక్కడైన తీసుకోవచ్చన్నారు.
నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. సెంటర్లో ప్రతి రోజూ 100 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తారన్నారు. అనంతరం సెంటర్లో సదుపాయాలు కల్పించిన మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డిని అదనపు కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జున్ రావు, మండల వైద్యాధికారి సరిత, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.