హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయంలో మరోమారు భారీగా బంగారం పట్టుబడింది. గుర్తు తెలియని వ్యక్తుల బ్యాగ్లో రూ.1.28 కోట్ల విలువైన 2.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ఈకే-526 విమానంలోని ప్రయాణీకుల లగేజీని భద్రత సిబ్బంది తనిఖీచేశారు. అయితే ఎవరూ తమదిగా చెప్పుకోని ఒక బ్యాగ్ను అనుమానంతో తనిఖీ చేయగా అందులో 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు లభించినట్టు పేర్కొన్నారు. కేసు దర్యాప్తుచేస్తున్నారు.