హైదరాబాద్,మే 1: తెలంగాణా కేంద్రంగా కలిగిన ఆధునిక పాల ఉత్పత్తుల బ్రాండ్ సిద్స్ ఫార్మ్ తమ వినియోగదారులకు నాణ్యమైన ఆహారపదార్థాలను అందించాలనే లక్ష్యంతో అందిస్తున్న విలువ ఆధారిత ఉత్పత్తుల జాబితాలో నేచురల్ పనీర్ను చేర్చింది.ఎటువంటి ప్రిజర్వేటిస్ లేకుండా సరికొత్త గా పనీర్ను ఆవిష్కరించింది. దీనిలోని వినూత్నమైన అంశం ఏమిటంటే, పాలలో ఎలాంటి హార్మోన్లు, యాంటీబయాటిక్స్ లేదంటే నిల్వ చేసే పదార్థాలను వాడకపోవడం. అందువల్ల పన్నీర్ తాజాదనంగా ఉంటుంది. నూతనంగా ఆవిష్కరించిన పనీర్ ను ‘సాఫ్ట్ అండ్ క్రీమీ పనీర్ ’ పేరుతో రూపొందించారు. తమ రోజువారీ ఆహారంలో తగినంతగా ప్రొటీన్ను పొందాలని కోరుకునే శాఖాహారుల కోసం దీనిని తయారుచేసారు. భారతదేశ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఆహార పదార్థాలలో ఒకటిగా ఈ పనీర్ నిలిచింది. ఈ నేచురల్ పనీర్ 200 గ్రాముల ప్యాక్ 150 రూపాయల ధరలో లభిస్తుంది.
ఈ ఆవిష్కరణతో భారతదేశంలో 75వేల కోట్ల రూపాయలుగా ఉన్న పనీర్ మార్కెట్లో తమ వాటాను సొంతం చేసుకోవడం కోసం కంపెనీ లక్ష్యంగా చేసుకుంది. తెలంగాణాలో స్థానిక బ్రాండ్గా ఉన్న సిద్స్ఫార్మ్ త్వరలోనే ప్రాంతీయ బ్రాండ్గా నిలువాని లక్ష్యం చేసుకోవడంతో పాటుగా తాజా పనీర్ రుచులను సొంతం చేసుకోవాలనే వినియోగదారులనూ లక్ష్యంగా చేసుకుంది. అసలైన తాజాదనం, మృదత్వం కలిగిన నేచురల్ పనీర్ తో, భారతీయ కుటుంబాలు ఇప్పుడు రుచికరమైన, ఆరోగ్యవంతమైన, పోషకాలతో కూడిన రుచికరమైన పనీర్ రెసిపీలను సౌకర్యవంతంగా తమ ఇంటి వద్దనే ఆస్వాదించవచ్చు. ఈ బ్రాండ్ ఇప్పుడు తమ నేచురల్ పన్నీర్ తాజాదనాన్ని అతి తక్కువ షెల్ఫ్ లైఫ్తో నిర్ధారిస్తుంది.”తమ వినియోగదారులకు కల్తీలేని పాల ఉత్పత్తులను అందించాలన్నది తమ బ్రాండ్ సిద్ధాంతం ,పాల ఉత్పత్తులకు సంబంధించి అసలైన తాజా దనపు అనుభవాలను వినియోగదారులకు అందించాలని కోరుకుంటున్నాం. తెలంగాణాలో ఆరోగ్యవంతమైన పాల ఉత్పత్తులను పరిచయం చేసిన ఒకే ఒక్క కంపెనీగా వినియోగదారుల కోసం మరిన్నిఉత్పత్తులనుతీసుకురాగలమని ఆశిస్తున్నాము’’ అని సిద్స్ ఫార్మ్స్ ఫౌండర్ అండ్ సీఈవో డాక్టర్ కిశోర్ ఇందుకూరిఅన్నారు.