కుమ్రంభీం ఆసిఫాబాద్ : జిల్లాలోని పెంచికల్పేట్ పెద్దవాగు ప్రాంతంలో పెద్దపులి కలకలం రేపింది. మండలంలోని అగర్గూడ గ్రామానికి చెందిన మహిళలు గ్రామ సమీపంలో గల పెద్దవాగుకు బట్టలు ఉతికేందుకు శనివారం వెళ్లారు. వారి సమీప ప్రాంతానికి పెద్దపులి వచ్చి ఒక్కసారిగా గాండ్రించింది. దీంతో వారంతా కేకలు వేయగా.. చుట్టుపక్కల వారందరూ పెద్దగా అరవడంతో అటవీ ప్రాంతంలోకి వెళ్లింది.
దీనిపై అటవీశాఖ అధికారులను వివరణ కోరగా.. పెద్దపులి సంచరించడం వాస్తవమేనని తెలిపారు. ఎండాకాలం కావడంతో దాహం తీర్చుకునేందుకు వాగు ప్రాంతానికి వస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
కర్నాటక జల దోపిడిపై సీఎం కేసీఆర్కు ఫిర్యాదు
కొత్తూరును కొత్తగా మారుస్తాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఆలోచించి ఓటు వేయండి..అభివృద్ధికి పట్టం కట్టండి
అందరినీ ఒకే తీరుగా చూసే ఏకైక పార్టీ టీఆర్ఎస్
పాక్ డ్రోన్లపై బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు