న్యూఢిల్లీ: రైల్వే శాఖ పరిధిలోని డెడికేటెడ్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్సీసీఐఎల్)లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేల 23 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1074 పోస్టులను భర్తీ చేయనుంది. ఖాళీలు సివిల్, ఎలక్ట్రికల్, ఎస్ అండ్ టీ, ఆపరేషన్స్ అండ్ బీడీ, మెకానికల్ డిపార్ట్మెంట్లలో ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 1074
ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 442, జూనియర్ ఎగ్జిక్యూటివ్ 519, జూనియర్ మేనేజర్ 111 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. అభ్యర్థులు 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో. అర్హత కలిగినవారిని ఆన్లైన్ రాతపరీక్షకు పిలుస్తారు.
అప్లికేషన్ ఫీజు: ఎగ్జిక్యూటివ్కు రూ.900, జూనియర్ ఎగ్జిక్యూటివ్కు రూ.700, జూనియర్ మేనేజర్కు రూ.1000
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 24
దరఖాస్తులకు చివరితేదీ: మే 23
రాతపరీక్ష: జూన్ నెలలో
వెబ్సైట్: dfccil.com
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..