తిమ్మాపూర్, ఏప్రిల్ 23: అంబులెన్స్ వాహనదారులు కొవిడ్ రోగుల బంధువుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణాశాఖ అధికారి మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రవాణాశాఖ కార్యాలయంలో అంబులెన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ రెండో వేవ్ ప్రబలుతున్న నేపథ్యంలో కొవిడ్ రోగులను చేరవేసే వాహనదారులు మరింత బాధ్యాతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమయంలో వాహనదారులు, డ్రైవర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కొందరు కొవిడ్ రోగుల బంధువుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇష్టారాజ్యంగా అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎంవీఐ నాగలక్ష్మి, అంబులెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు రవి, విష్ణు, శేఖర్, సర్వేశం, మనోహర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కొవిడ్ నిర్ధారణకు 6 నిమిషాల నడక పరీక్ష..!
తాలు, తరుగు పేరుతో ఇబ్బంది పెడితే కఠిన చర్యలు