జెడ్పీ సీఈవో జ్యోతి
ఎంసీటీసీ ఎన్నికలపై ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణ
జడ్చర్ల, ఏప్రిల్ 19: ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ప్రతివిషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి నామినేషన్లను స్వీకరించాలని జెడ్పీ సీఈవో జ్యోతి అధికారులకు సూచించారు. జడ్చర్ల మండలం పరిషత్ కార్యాలయ ఆవరణలో జడ్చర్ల మండల ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఆర్వో, ఏఆర్వోలకు ఎన్నికలపై సోమవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి జెడ్పీ సీఈవో హాజరై మాట్లాడారు. ఎన్నిల కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాలను తూచాతప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. నామినేషన్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్రెడ్డి, శిక్షకులు హన్వాడ ఎంపీడీవో నటరాజ్ ఉన్నారు.
ఎంపీటీసీ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు
జడ్చర్ల మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒకటిరెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా జడ్చర్ల మండలంలో నిర్వహించే 15 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కోసం అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. అదేవిధంగా 15ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లను స్వీకరించేందుకు సంబంధించి కూడా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలేపల్లిలో పోలేపల్లి, ఉదండాపూర్, ఖానాపూర్, వల్లూరు గ్రామాల అభ్యర్థులు, కోడ్గల్ కేంద్రంలో కోడ్గల్, లింగంపేట, పెద్ద ఆదిరాల, చిన్నఆదిరాల అభ్యర్థులు, జడ్చర్ల మండల మహిళా సమాఖ్య హాలులో గొల్లపల్లి, మల్లెబోయిన్పల్లి, ఆలూరు, బూర్గుపల్లి అభ్యర్థులు, గంగాపూర్లో కేంద్రంలో గంగాపూర్, నసరుల్లాబాద్, అల్వాన్పల్లి అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి నామినేషన్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించారు. అయితే ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రాలేదు.
ఇవి కూడా చదవండి
డాక్టర్ పై చేయిచేసుకున్న మహిళ
కన్నడ రచయిత వెంకటసుబ్బయ్య మృతికి ప్రధాని సంతాపం