రూ.17లక్షల ఎస్సీఎస్పీ నిధులతో సీసీ రోడ్లు, మురికి కాలువలు : ఎమ్మెల్యే మాణిక్రావు
జహీరాబాద్, ఏప్రిల్ 18: జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 13 వార్డు (బాగారెడ్డిపల్లి)లో రూ.17లక్షల ఎస్సీఎస్పీ 2019-20 షెడ్యుల్ క్యాస్ట్ సబ్ ప్లాన్) నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు మురికి కాలువల నిర్మాణ పనులను ఎమ్మెల్యే మాణిక్రావు ఆదివారం ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో జహీరాబాద్ మున్సిపాలిటీ అనేక అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రూ.50కోట్ల ప్రత్యేక నిధులతో జహీరాబాద్ పట్టణం అభివృద్ధి చేశామన్నారు. పట్టణ సుందరీకరణలో భాగంగా జాతీయ రహదారిపై డివైడర్ నిర్మాణం, పార్కులు, వైకుంఠధామాల నిర్మాణాలు చేశామన్నారు. జహీరాబాద్ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బండి మోహన్, నామ రవికిరణ్, ముత్యాల చందు, యాకుబ్, తులసీదాస్, బాబీ, రాకేశ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
అచ్చంపేట మున్సిపాలిటీకి 148 నామినేషన్లు దాఖలు