మంచిర్యాల : ట్రాక్టర్, బైక్ ఢీకొని ఇద్దరు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల గ్రామ శివారు వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది.
ప్రమాదంలో మరో మహిళకు తీవ్రగాయాలుకాగా స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం మంచిర్యాల దవాఖానకు తరలించారు.
మృతుల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణం కావచ్చని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి