నేచురల్ స్టార్ నాని గత ఏడాది వి అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలసిందే. కరోనా వలన వి చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఇక ఈ ఏడాది మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇందులో టక్ జగదీష్ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, కరోనా వాలన కొద్ది రోజులు వాయిదా వేశారు. ఇక శ్యామ్ సింగరాయ్ అనే చిత్రం కూడా తుది దశకు చేరుకుంది. మరి కొద్ది రోజులలో ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు.
నాని నటిస్తున్న ఫన్ ఎంటర్టైనర్ అంటే సుందరానికి చిత్ర షూటింగ్ కూడా మరి కొద్ద రోజులలో మొదలు కానుంది. వీలైతే ఈ ఏడాది లేదంటే వచ్చే ఏడాది మొదట్లో చిత్రాన్ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అయితే ఇప్పుడు నాని చేతిలో మూడు సినిమాలలో ఉన్న కామన్ పాయింట్ గమనిస్తే మూడు చిత్రాలు ఆయా చిత్రాల దర్శకులకు మూడో సినిమా. శివ నిర్వాణ గతంలో నిన్ను కోరి, మజిలి చిత్రం చేయగా ఇప్పుడు మూడో చిత్రంగా టక్ జగదీష్ చేశాడు. ఇక రాహుల్ సంకీర్తయాన్ ది ఎండ్, సంకీర్తయాన్ అనే చిత్రాలు చేశాడు. ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక అంటే సుందరానికి చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ గతంలో మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా చిత్రాలు చేశాడు. మూడో సినిమాను నానితో చేయనున్నాడు. ఇలా ముగ్గురు దర్శకులకు నాని చిత్రాలు మూడోవి కాగా, అవి ఎంత విజయం సాధిస్తాయో చూడాలి.