జగిత్యాల : ధాన్యం కొనుగోళ్లపై అన్నదాతలు ఆందోళన చెందవద్దు. ఊరూరా ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేసి పండిన ప్రతి గింజనూ కొంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. అధికారులు పల్లె ప్రగతి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
శుక్రవారం జగిత్యాల జడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. జగిత్యాలలో డీఆర్డీఏ, జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కరోనా కట్టడికి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ ధాన్యం కొనుగోళ్లు చేస్తుందని చెప్పారు. ఆయన వెంట జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
బీజేపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరికలు
రైతులు డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి
బీచ్లో శ్రద్దాదాస్ షికార్లు..ఫొటోలు వైరల్
త్వరలో టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం : మంత్రి ఎర్రబెల్లి
మాస్క్ ధరించాలని పోలీసుల ప్రచారం