నాగర్కర్నూల్ /అచ్చంపేట : ప్రమాదవాశాత్తు మిషన్ భగీరథ పైపులు అగ్ని ప్రమాదంలో కాలిబూడిదైన సంఘటన జిల్లాలోని అచ్చంపేట పట్టణంలోని మధురానగర్ కాలనీలో చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న ఆర్డీవో పాండు నాయక్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కాగా, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.