వెలిచాల లక్ష్మీనృసింహుడి సన్నిధిలో వేణుగోపాలుడి కల్యాణం
భక్తి భావనతో సమసమాజ స్థాపన
త్రిదండి చిన జీయర్స్వామి
రామడుగు, మార్చి 24: వెలిచాలలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్స్వామి పర్యవేక్షణలో బుధవారం రుక్మిణీసత్యభామ శ్రీ వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్న చిన జీయర్స్వామికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఆవరణలో రుక్మిణీ సత్యభామ సహిత శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవ మూర్తులకు కల్యాణ మహోత్సవ ఘట్టాన్ని జరిపించారు. ఈ సందర్భంగా చిన జీయర్ స్వామి మంగళశాసనాలు అందజేశారు. భక్తి భావనతోనే సమసమాజ స్థాపన జరుగుతుందన్న నిజాన్ని వెయ్యేండ్ల క్రితమే భగవత్ రామానుజాచార్యులు నిరూపించారన్నారు. శంషాబాద్ ఆశ్రమంలో రామానుజాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, వచ్చే ఫిబ్రవరిలో విగ్రహావిష్కరణతో పాటు వెయ్యి 35 కుండలాలను ఏర్పాటు చేసి హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి హిందువు ఈ క్రతువులో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. హోమానికి లక్ష కిలోల స్వచ్ఛమైన నెయ్యి అవసరమవుతుందని, దాతలు దేశవాళీ ఆవు నెయ్యి హోమానికి తీసుకురావాలన్నారు. అనంతరం సమీపంలో సర్పంచ్ వీర్ల సరోజన ప్రభాకర్రావు దంపతులు సొంత ఖర్చులతో నిర్మించిన పల్లె ప్రకృతివనం(నందనవనం)లో ఏర్పాటు చేసిన వసంతోత్సవంలో చిన జీయర్స్వామి పాల్గొన్నారు. నందనవనం బాగుందని సర్పంచ్ను అభినందించారు. కొబ్బరికాయ కొట్టి నందనవనం ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు, మాజీ జడ్పీటీసీ వీర్ల కవిత, ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, చల్మెడ వైద్య కళాశాల చైర్మన్ లక్ష్మీనర్సింహారావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి, ఉప సర్పంచ్ పూదరి వెంకటేశ్, మాజీ సర్పంచులు వీర్ల రవీందర్రావు, నర్సింగరావు, కాడె శంకర్, పెద్దిగారి ఎల్లయ్య, నాయకులు కలిగేటి లక్ష్మణ్, వీర్ల సంజీవరావు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండలో సీతారాముల..
తిమ్మాపూర్ రూరల్, మార్చి24: మండలంలోని నల్లగొండలో శ్రీ సీతారామలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం బుధవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఎస్పీ వెంకటేశ్వర్లు సమక్షంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి, రాత్రి స్వామి వారి కల్యాణం నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మక్తపల్లికి చెందిన భక్తుడు తమ్మిశెట్టి మల్లయ్య అన్నదానం చేశారు. ఈ వేడుకల్లో ఆలయ చైర్మన్ శ్రీనివాస్రావు, ఈవో ముద్దసాని శంకర్, సర్పంచ్ దన్నమనేని శోభానర్సింగరావు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.