యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా.. స్వామివారి కల్యాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కల్యాణాన్ని తిలకించారు. కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి, జెడ్పీ చేర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.