హైదరాబాద్ : నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యం ఓట్లలో ఎవరికీ పూర్తి మెజారిటీ రాకపోవడంతో ద్వితీయ ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నల్గొండ పట్టభద్రుల స్థానంలో 65 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు. ఎలిమినేషన్ అభ్యర్థుల ఓట్లు మిగతా అభ్యర్థులకు బదిలీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డికి 2,224 ఎలిమినేషన్ ఓట్లు లభించగా.. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 2,488, ప్రొఫెసర్ కోదండరామ్కు 2,166 ఓట్లు వచ్చాయి. ఎలిమినేషన్ ఓట్లు కలుపుకొని పల్లా రాజేశ్వర్రెడ్డికి 1,14,046 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 86,614, కోదండరామ్కు 73,286, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డికి 40,594 ఓట్లు వచ్చాయి. అభ్యర్థి విజయానికి 1,83,167 ఓట్లు అవసరం.