హైదరాబాద్ : తాగి వాహనాలు నడిపిన 91 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బుధవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్ణీత మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలను నడిపిన 159 మంది వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిని గురువారం స్థానిక కోర్టులో హాజరు పరచగా 91 మందికి న్యాయస్థానం ఒక రోజు నుండి గరిష్ఠంగా 22 రోజుల జైలు శిక్ష విధించింది. జరిమానాలుగా మొత్తం రూ.6.8 లక్షలను విధించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా రాజేంద్రనగర్లో 49 మంది, మాదాపూర్లో 14, షాద్నగర్లో 10, గచ్చిబౌలిలో 9, బాలానగర్లో 9 మంది పట్టుబడ్డారు. వీరందరి డ్రైవింగ్ లైసెన్స్ల సస్పెన్షన్ కోరుతూ రిజినల్ ట్రాన్స్పోర్టు అథారిటీకి పంపించారు.