ఆర్మూర్, మార్చి 18 : తెలంగాణ ప్రాంతం నుంచి బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాల్లో ఉంటున్న కార్మికులను ఆదుకోవాలని రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలో ప్రభుత్వం నిర్ణయించడం సంతోషం. కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయడానికి ప్రత్యేక బృందం అక్కడ పర్యటించింది. బృందం అందజేసే నివేదిక ఆధారంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది. కార్మికుల సంక్షేమం కోసం సహకారమందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డికి కృతజ్ఞతలు.
-కోటపాటి నర్సింహనాయుడు, ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు