భువనేశ్వర్: శిశువు మృతదేహాన్ని వీధి కుక్క ఆసుపత్రి నుంచి నోటకరుచుకెళ్లింది. గమనించిన కొందరు దానిని వెంబడించగా ఆడ శిశివు మృతదేహాన్ని వదిలి వెళ్లింది. ఒడిశాలోని భద్రక్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుప్రతిలో ఈ ఘటన జరిగింది. సోమవారం ఒక కుక్క నవజాత శిశువు మృతదేహాన్ని నొటకరుచుకుని ఆసుపత్రిలో తిరుగసాగింది. గమనించిన కొందరు దానిని వెంబడించడంతో ఆడ శిశువు మృతదేహాన్ని వదిలి పారిపోయింది.
మరోవైపు ఈ ఘటనపై ఆసుపత్రిలోని కొందరు మండిపడ్డారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. అయితే నెలలు నిండని ఆడ శిశువు మృతదేహాం ఎక్కడి నుంచి వచ్చిందో తమకు తెలియదని జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. కాగా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.