2021-22 సంవత్సరానికి ఆర్థిక శాఖ రూపొందించిన వార్షిక బడ్జెట్కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తుది మెరుగులు దిద్దారు. సీఎం అధ్యక్షతన బుధవారం రాత్రి ఏడు గంటలకు సమావేశమయ్యే రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్కు ఆమోదం తెలుపనున్నది. అనంతరం గురువారం బడ్జెట్ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు.
ప్రత్యేక ప్రతినిధి, మార్చి 16 (నమస్తే తెలంగాణ): గత ఏడాది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నెలకొన్న కరోనా నీలినీడలు క్రమంగా తొలగిపోతున్న నేపథ్యంలో వచ్చే వార్షిక బడ్జెట్ ప్రజల ఆకాంక్షలు తీర్చేదిగా ఉం టుందని భావిస్తున్నారు. కరోనా కారణంగా గత ఏడాది ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ కొద్ది నెలల్లోనే రాబడి పెరుగడంతో తిరిగి నిలదొక్కుకుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం వచ్చే బడ్జెట్లోనూ ఆ ఒరవడిని కొనసాగించనున్నదని సమాచారం. బడ్జెట్ ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఇప్పటికే తుదిరూపం ఇచ్చింది. ఈ బడ్జెట్కు సీఎం కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన బుధవారం రాత్రి సమావేశమయ్యే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అనంతరం గురువారం ఆర్థికమంత్రి టీ హరీశ్రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి బడ్జెట్ భారీగా ఉంటుందని తెలిసింది. సొంత రాబడులతోపాటు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) జాతీయ సగటు కన్నా, ఇతర రాష్ర్టాలకన్నా మెరుగ్గా ఉన్నది. గత నాలుగు నెలలుగా పెరుగుతున్న ఆదాయాన్ని బట్టి వచ్చే ఆర్థిక సం వత్సరంలోనూ వ్యయం కంటే రాబడి పెరుగగలదని అధికారులు అంచనా వేసినట్టు సమాచారం. వచ్చే సంవత్సరానికి రెవెన్యూ మిగులు చూపే అవకాశమున్నదని అంటున్నారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా వ్యవసా యం, దాని అనుబంధ రంగాల ద్వారా సంపద అంచనాలకు మించి పెరిగింది. సేవా, ఉత్పత్తి రంగాలు దెబ్బతిన్నప్పటికీ పంటల దిగుబడి భారీగా నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో పెట్టుబడి వ్యయం పెంచడంతో నీటిపారుదల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకొన్నాయి. దీంతో పంట ఉత్పత్తి భారీగా పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 6 నుంచి 10 శాతం లోపే ఉన్న వ్యవసాయ, దాని అనుబంధరంగాల స్థూల సంపద, ఇప్పుడు 20 నుంచి 25 శాతం వరకు పెరిగింది.
ఈ నెలాఖరుతో ముగియనున్న ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ, క్యాపిటల్ రాబడులు రూ.1,82,914 కోట్లు ఉన్న నేపథ్యంలో వచ్చే బడ్జెట్ సైజు పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గతనాలుగు నెలలుగా రెవెన్యూ ఆదాయం పెరుగడం, జీఎస్డీపీ వృద్ధిరేటును నమోదు చేసుకోవడం ఇందుకు ఆధారంగా భావిస్తున్నారు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థలు పతనపై తిరిగి ఏకబిగిన ‘వీ’ ఆకారంలో ప్రగతి సాధించిన రాష్ర్టాలలో తెలంగాణ ముందు వరుసలో జీఎస్టీ, వ్యాట్ ద్వారా రాబడి రూ.50 వేల కోట్లకు చేరుకున్నది. మొత్తంగా రూ.1,76,393 కోట్లు ఉంటుందని అంచనావేయగా, జనవరి నెలాఖరు నాటికి రూ.1,18,977 కోట్లకు చేరిం ది. ఈ నెలాఖరు వరకు లక్ష్యాన్ని చేరవచ్చని భావిస్తున్నారు. ఈసారి సొంత రాబడుల ద్వారా రూ.85 వేల కోట్లు సమకూరుతాయని అంచనావేయగా, ఇప్పటికి రూ.60 వేల కోట్ల వరకు వచ్చినట్టు తెలిసింది. ఈ నెలలో రాబడి భారీగా పెరుగనున్నందున బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని సమాచారం.
ఉమ్మడి రాష్ట్రంలో 2004-14 వరకు పదేండ్లలో పెట్టుబడి వ్యయం కింద కేవలం రూ.59వేల కోట్లు మాత్రమే వెచ్చించారు. తెలంగాణ ఆవిర్భవించిన తరువాత తొలి ఆరేండ్లలో రూ.1.60 లక్షల కోట్లకుపైగా పెట్టుబడి వ్య యం కింద ఖర్చు చేశారు. ఇది కేంద్ర బడ్జెట్లో జరిపే కేటాయింపుల శాతం కన్నా అధికం కావడం విశేషం. కేంద్ర బడ్జెట్లో పెట్టుబడి వ్యయం కింద కేటాయింపులు 10 నుంచి 12 శాతం లోపే ఉంటాయి. అనేక రాష్ర్టాలు సైతం 10 నుంచి 20 శాతం లోపే పెట్టుబడి వ్యయం కింద కేటాయింపులు జరుపుతున్నాయి. కానీ తెలంగాణ లో ఈ కేటాయింపులు 20 నుంచి 25 శాతం మధ్య ఉంటున్నాయి. పెట్టుబడి వ్యయం కేటాయింపులలో వ్యవసాయం, సాగునీటి రంగానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తరువాత రవాణా, పరిశ్రమలకు మౌలిక వసతులు, ఖనిజ వనరుల అభివృద్ధికి కూడా భారీగా వ్యయం చేస్తున్నది. ఫలితంగా జీఎస్డీపీలో రాష్ట్రం వృద్ధిని నమోదు చేస్తున్నది.
తెలంగాణ ఏర్పడిన 2014-15లో పెట్టుబడి వ్యయం కింద రూ.8,372.94 కోట్లు ఖర్చు చేయగా మరుసటి సంవత్సరం అది రూ. 13,590.39కోట్లకు పెరిగింది. ఆ మరుసటి ఏడాదిలో కేటాయింపులు రూ.33,370.57 కోట్లకు పెరిగాయి. 2019-20లో నీటిపారుదల ప్రాజెక్ట్లకే రూ.25వేల కోట్ల వరకు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21 బడ్జెట్లో పెట్టుబడి వ్యయాన్ని రూ.22వేల కోట్లుగా చూపారు. కాగా బడ్జెట్తో పాటు బడ్జెటేతర నిధుల ద్వారా పెట్టుబడి వ్యయం 30 శాతం దాటుతున్నది. రాష్ట్రంలో ప్రతిఇంటికి మంచినీటిని అందించడానికి చేపట్టిన మిషన్ భగీరథ లాంటి బృహత్తర కార్యక్రమాలకు బడ్జెట్లో కాకుండా ప్రభుత్వం ఇతరత్రా నిధులను ఖర్చు చేసింది.
తెలంగాణ ఏర్పడిన మొదటి ఏడాది నుంచే రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ సంపద సృష్టిపై దృష్టిని కేంద్రీకరించింది. సాగునీరు, వ్యవసాయం తదితర రంగాలపై ప్రభుత్వం దూరదృష్టితో పెట్టిన ఖర్చుతో అద్భుత ఫలితాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఓవైపు అభివృద్ధి, సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూనే భవిష్యత్ సంపద సృష్టికి కేటాయింపులు చేస్తూ ప్రతి బడ్జెట్లో ప్రభు త్వం సమతుల్యత పాటించింది. వ్యవసాయం, నీటిపారుదల ప్రాజెక్టులు, రవాణా, మౌలిక వసతుల కల్ప న, ఖనిజాభివృద్ధి తదితర రంగాలకు చేసే కేటాయింపులను మూలధన వ్యయంగా పేర్కొంటారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం మొదటి నాలుగేండ్లు పెట్టుబడి వ్యయానికి భారీగా నిధులు కేటాయించడంతో ఐదో సంవత్సరం నుంచే ఫలితాలు రావడం మొదలైంది. ముఖ్యంగా సాగునీటి కోసం ప్రాజెక్టుల నిర్మాణానికి జరిపిన కేటాయింపులతో వ్యవసాయ ఉత్పత్తులు భారీ గా పెరిగాయి. నేడు రాష్ట్ర సంపదలో వ్యవసాయ ఉత్పత్తులదే ప్రధాన వాటా. ఇదివరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో 10శాతం లోపే ఉన్న వ్యవసాయ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాటికి 40 శాతానికిపైగా పెరిగింది. మొదటినుంచి రాష్ట్ర జీఎస్డీపీలో ఐటీ, సేవారంగాలదే సింహభాగం. కానీ ప్రభుత్వం నీటి పారుదల రంగానికి భారీగా నిధులు ఖర్చు చేయడం వల్ల వ్యవసాయం రంగం కూడా ఉరకలెత్తి సంక్షోభ సమయంలో కూడా సత్తా చాటుకుంది. దేశవ్యాప్తంగా సేవా రంగాలు చతికిల పడిన సమయంలో వ్యవసాయరంగం ఆదుకున్నది. కరోనా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ) తిరోగమ దిశగా సాగుతుండగా, వ్యవసాయ ఉత్పత్తులు ఇచ్చిన ఊతంతో రాష్ట్ర జీఎస్డీపీ మాత్రం పురోగమనం దిశగా సాగుతున్నది.