హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ధన్యవాదాలు
తెలిపారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ కానంత భారీ స్థాయిలో పోలింగ్లో పాల్గొని పట్టభద్రులు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారని ప్రశంసించారు.
సీఎం కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు పెరిగిన నమ్మకానికి ఈ పోలింగ్ నిదర్శనమన్నారు.
పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్ల నమోదు నుంచి వారి ఓటు హక్కు వినియోగించుకునేలా సహకరించిన పార్టీ నేతలు, ఎన్నికల ఇన్చార్జీలు, అధికారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముందే ఓటమిని పసిగట్టిన బీజేపీ నేతలు చివరి నిమిషంలో సానుభూతి ద్వారా ఓట్లు సంపాదించాలనే చిల్లర రాజకీయాలతో మహబూబాబాద్లో అల్లరి చేయడం వారి దౌర్భాగ్య పరిస్థితికి నిదర్శమన్నారు.