ఇండియన్ సినిమాలో ఓ వెలుగు వెలిగిన తెలుగు లెజెండరీ నటీనటుల్లో టాప్ ప్లేస్ లో ఉంటారు అలనాటి అందాల తార సావిత్రి. ఇప్పటికే సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా మరో క్రేజీ బయోపిక్కు టాలీవుడ్ లో సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, ఎస్వీ రంగారావు లెజెండరీ నటులతో పోటీపడి నటించిన తారల్లో సావిత్రి తర్వాత జమున ఉంటారు.
జమున మంచి నటి మాత్రమే కాదు..గొప్ప డ్యాన్సర్ కూడా. ఇపుడు జమున బయోపిక్ను సిల్వర్ స్క్రీన్ పై తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్త హాట్ టాపిక్గా మారింది. దేవినేని సినిమా డైరెక్టర్ శివనాగు నర్రా ఇప్పటికే జమున స్టోరీకి సంబంధించి స్క్రిప్ట్ పనులు సిద్దం చేశాడట. జమునను సంప్రదించి ఆమె సలహాలు, సూచనలు, ఇన్పుట్స్ తీసుకున్నాడని తెలుస్తోంది.
అన్నీ కుదిరితే జమున బయోపిక్లో మిల్కీ బ్యూటీ తమన్నాను మెయిన్ లీడ్ లో కనిపించనుందని టాక్. యాక్టింగ్, డ్యాన్స్ లో దిట్ట అయిన తమన్నా ఈ పాత్రకు కరెక్టుగా సరిపోతుందని డైరెక్టర్ భావిస్తున్నాడని ఇన్ సైడ్ టాక్.