న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: జన్ధన్ ఖాతాదారులకు శుభవార్త. ఎస్బీఐ జన్ధన్ ఖాతాదారులు రూపే జన్ ధన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటే రూ.2 లక్షల వరకు ప్రమాద బీమాను పొందవచ్చని ఆ బ్యాంకు తెలిపింది. ఇప్పుడే ఎస్బీఐ రూపే జన్ధన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోండి అంటూ బ్యాంక్ ట్వీట్ చేసింది. ప్రధాన మంత్రి జన్ధన్ యోజన కింద 41.75 కోట్ల బ్యాంక్ ఖాతాలు తెరుచుకోగా, ఇందులో 35.96 కోట్ల ఖాతాలు ప్రస్తుతం నిర్వహణలో ఉన్నాయి. గ్రామీణ ప్రజలు, పట్టణాల్లోని గృహస్తులకు బ్యాంకింగ్ సేవలను అందించాలనే లక్ష్యంతో జన్ధన్ ఖాతాలను కేంద్రం పరిచయం చేసింది.
భారతీయులు ఎవరైనా ఈ ఖాతాను తీసుకోవచ్చు. వయసు పదేండ్లు అంతకుమించి ఉండాలి.