దేవరకొండరూరల్, జూలై 22 : మండలంలోని కర్నాటిపల్లి గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు పనులను ఎంపీడీఓ రామకృష్ణ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ 24న మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా 7 వేల మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 5వేల మొక్కలు నాటడానికి జేసీబీతో గుంతలు తీసినట్లు తెలిపారు. అలాగే కొండభీమనపల్లిలో 2 వేల అవెన్యూప్లాంటేషన్ మొక్కలు అదే రోజు నాటడానికి గుంతలు తీసి సిద్ధంగా ఉంచామన్నారు. కార్యక్రమంలో ఏపీఓ రామచంద్రం, సర్పంచ్ ఆంబోతు కాళి, పంచాయతీ కార్యదర్శి మంజుప్రియ పాల్గొన్నారు.
మిర్యాలగూడ రూరల్ : వెంకటాద్రిపాలెంలో బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను ఎంపీడీఓ అజ్మీరాదేవిక, ఎంపీఓ వీరారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మెగా హరితహారం చేపట్టనున్నట్లు చెప్పారు.
అడవిదేవులపల్లిలో..
అడవిదేవులపల్లి : మండల కేంద్రంలోని బృహత్ పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం పనులను ఎంపీడీఓ మసూద్ షరీఫ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదే శాల ప్రకారం 15 రోజుల్లో వనాన్ని పూర్తి చేయనున్నట్లు చెప్పారు. పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఆయన వెంట ఏపీఓ నాగేశ్వర్రావు, సర్పంచ్ కొత్తా మర్రెడ్డి ఉన్నారు.