నూతనకల్, జూలై 16 : ప్రభుత్వ దవాఖానల్లోప్రసవాల సంఖ్యపెంచాలని వైద్యాధికారి కోటాచలం సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు, వ్యాక్సినేషన్, ల్యాబ్, లేబర్ రూమ్, రికార్డులను పరిశీలించారు. అనంతరం గుండ్లసింగారం గ్రామంలో డీఈసీ మాత్రల పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న కేసీఆర్ కిట్, ఇతర రాయితీలు పొందాలంటే ప్రభుత్వ దవాఖానల్లోనే కాన్పులు జరిపించాలన్నారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు. బోదకాలు వ్యాధి నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సాహితి, మండల వైద్యాధికారి త్రివేణి, సీహెచ్ఓ శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి
తుంగతుర్తి : ప్రతిఒక్కరూ డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. మండలంలోని కర్విరాల కొత్తగూడెంలో శుక్రవారం డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 50,460 మందికి మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గర్భిణులు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసూతి అయ్యేలా ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నాగూనాయక్, ఎంపీఓ సముద్రాల సూరి, సిబ్బంది గోవిందరెడ్డి, గాజుల సోమయ్య, యాదగిరి, జానకి, భారతి పాల్గొన్నారు.
బోదకాలు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి
కోదాడ టౌన్ : బోదకాలు వ్యాధి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అసంక్రమిత వ్యాధుల ప్రోగ్రాం అధికారి డాక్టర్ కళ్యాణ్చక్రవర్తి అన్నారు. మండలంలోని దోరకుంట, నల్లబండగూడెం, చిమిర్యాల గ్రామాల్లో ఇంటింటికీ డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి శ్రీనివాస్నాయక్, సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాస్రాజు, యాతాకుల మధుబాబు, శ్రీనివాస్, మీనాకుమారి, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
చిలుకూరు : బోదకాలు రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా అసంక్రమిత వ్యాధుల అధికారి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. మండలంలో డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రల పంపిణీని పరిశీలించి మాట్లాడారు. ప్రమోద్కుమార్, సీహెచ్ఓ వినోద్, హెల్త్ అసిస్టెంట్ శ్రీను, శ్రీనివాస్రాజు, జ్యోతి
మఠంపల్లి : మండల వ్యాప్తంగా రెండో రోజు మాత్రలు పంపిణీ చేశారు. మండల కేంద్రంలో ఎంపీడీఓ జానకీరాములు మాత్రల పంపిణీని పర్యవేక్షించారు.
బొడ్రాయిబజార్ : పట్టణంలోని 7వ వార్డులో కౌన్సిలర్ కుంభం రేణుకా రాజేందర్ ప్రజలకు డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. మాత్రలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. టీఆర్ఎస్ నాయకులు కుంభం రాజేందర్, బండారు మధు, కృష్ణ, నజీర్, లింగయ్య, వెంకన్న, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
నాగారం : మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. నాగారంలో సర్పంచ్ చిప్పలపల్లి స్వప్న, ఎంపీటీసీ ఈరేటి స్వప్న పంపిణీని పరిశీలించారు. డాక్టర్ రామకృష్ణ, పీహెచ్ఎన్ ధనమ్మ, ఏఎన్ఎం నాగమ్మ, పార్వతి, యాదగిరి, ప్రవీణ్రెడ్డి, సోమలక్ష్మి, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.