హైదరాబాద్/ నిజామాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలిగి.. విశ్వకల్యాణం లక్ష్యంగా నిజామాబాద్లో గురువారం నుంచి మూడు రోజులపాటు చతుర్వేదసదస్సు-అథర్వణ వేద హవనం జరుగనున్నది. తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్ధక సభ- శాక్త పరిషత్ సంయుక్త నిర్వహణలో నిజామాబాద్లోని శ్రద్ధానంద్గంజ్ ఉమామహేశ్వర ఆలయంలో ఈకార్యక్రమాలు జరుగనున్నాయి. కార్యక్రమంలో భాగంగా వేద పండితులతో ప్రవచనాలు, వేద విద్యార్థులకు పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్ల ప్రదానం ఉంటుంది. వేదాల గొప్పతనాన్ని భావితరాలకుతెలియజేయడంతోపాటు అథర్వణవేద యాగంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలిగిపోయేందుకు యాగం నిర్వహిస్తున్నారు. గణపతి ప్రార్థన, అథర్వణ వేద యాగం కోసం ప్రత్యేకంగాహోమకుండాలను సిద్ధంచేశారు.
వేద సంరక్షణే ధ్యేయం
తెలంగాణ వైదిక విద్యావేత్తల సాధికారత స్వాభిమాన సాధనే లక్ష్యంగా మూడేండ్ల క్రితం తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్ధక సభ ఏర్పాటైంది. వేద పండితులను సముచితస్థాయిలో గౌరవించుకోవడంతోపాటువేదవిద్య ప్రోత్సాహానికి ఏటా సదస్సులు నిర్వహిస్తున్నది. వేదవిద్యను అభ్యసించేవారికి ఉచితంగా అధ్యయనశాలలు, అభ్యాస శిబిరాలను ఏర్పాటుచేస్తున్నది. ఈ ఏడాది నిర్వహిస్తున్న సదస్సులోనిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ (అర్బన్) ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, మేయర్ దండు నీతూ కిరణ్శేఖర్, ఎమ్మెల్సీ ఎస్ వాణీదేవి, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్అధ్యక్షుడు కేవీ రమణాచారి, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్, బ్రాహ్మణ సంఘం గౌరవ సభ్యులు సంకెపెల్లి సుమలత సుధాకర్శర్మ. మరుమాముల వెంకటరమణశర్మ, తెలంగాణబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కంజర్కర్ భూపతి, ఇందూరు బ్రాహ్మణ సమాజం అధ్యక్షుడు అజయ్ సంగ్వాయి, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ధన్పాల్ సూర్వనారాయణ గుప్తా తదితరులుముఖ్యఅతిథులుగా పాల్గొంటారు. తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్ధక సభ అధ్యక్షులు వ్యాసోజ్జల రాధాకృష్ణ శర్మ, కోశాధికారి చేబియ్యం రాఘవశర్మ, కార్యదర్శి తమ్మర యజ్ఞనారాయణ కిషోర్శర్మహాజరవుతారు.
మూడు రోజుల పాటు కార్యక్రమాలు
తెలంగాణ వేద శాస్త్ర ప్రవర్ధక సభ, శాక్త పరిషత్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు చతుర్వేద సదస్సు, అథర్వణ వేదయాగం నిర్వహిస్తున్నాం. శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో విధుశేఖర భారతీమహాస్వామి వారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. కొవిడ్ నిబంధనలు అనుసరించి సదస్సు కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 35 వేద పాఠశాలలకు చెందిన విద్యార్థులు హాజరవుతారు.
వేలేటి పవన్ శర్మ, అధ్యక్షుడు, శాక్త పరిషత్