‘మట్టి చరిత్రే మనిషి చరిత్ర’ అంటారు ప్రముఖ కవి శివారెడ్డి. అవును! ప్రపంచమంతా మట్టి మీద.. కాదంటే ‘మట్టి మనిషి’ మీదే నిలబడేది. జ్ఞానానికి మూలం నేల. మట్టిలోని ధాతువులు మనిషిలోనూ ఉంటాయి. మనిషికి పర్యాయపదం మట్టి. ఈ సత్యం అందరూ తెలుసుకోవాలి. వేదాంత దృష్టి కూడా ఇదే. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు పెద్దలు. అన్నమే పరబ్రహ్మ స్వరూపం అయినప్పుడు ఆ అన్నాన్ని సృష్టించే రైతు ‘పరబ్రహ్మ కంటే కూడా గొప్పవాడు’ అని ఒప్పుకోక తప్పదు మరి. నాటినుంచి నేటివరకూ రైతు ఆధారిత దేశం భారతదేశం. వ్యవసాయం సాయం లేకుండా ఇక్కడ ఏ పనీ జరగదు. ప్రకృతి అండతో రైతు సేద్యం సాగుతున్న తరుణంలో వ్యవసాయ కళాశాలలు అందుబాటులోకి వచ్చి ఎంతమందికో సరికొత్త సాగు పద్ధతులు నేర్పాయి. ఇలాంటివాటిలో ‘బాపట్ల వ్యవసాయ కళాశాల’ ఒకటి. భూమిపుత్రుల కోసం ప్రయోగాలను, అధిక దిగుబడుల కోసం పరిశోధనలను నిర్వహించిన ఎందరో మహామహులకు ఇది పురిటిగడ్డ. ఈ విద్యాలయంలో చదువుకున్నవారు దేశం నలుచెరగులా వివిధ ఉన్నత పదవుల్లో ఉన్నారు.
రాజకీయాల్లో ఉన్నారు. వారు వ్యవసాయానికి, సమాజానికి చేసిన సేవలను తెలియజేయడానికి ‘వెలుగు పూలు’ పుస్తకాన్ని తాజాగా వెలుగులోకి తెచ్చారు సంకలనకర్తలు. కర్షకుడి కోసం నడుం బిగించిన కాకలుతీరిన యోధులను ఎందరినో ఈ పుస్తకం పరిచయం చేస్తుంది. వారి గమనాన్నీ, జీవితాన్నీ కళ్లకు కడుతుంది. దేశీయ వ్యవసాయరంగ యవనికపై ఈ పుస్తకం ఒక ఆకుపచ్చని సంతకం. ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాలి. రైతును గౌరవించే సంస్కారం ప్రతి ఒక్కరిలోనూ పెంపొందాలి కూడా. వెలుగుపూలు మనకిస్తున్న సందేశమూ అదే.
వెలుగు పూలు హరితరేఖల సంకలనం -2
పేజీలు : 264, వెల రూ. 250/-
ప్రతులకు: పద్మశ్రీ
డా. ఐ వి సుబ్బారావు స్మారక కమిటీ, వలేటి గోపీచంద్
ఫోన్ : 94412 76770
బుక్ షెల్ఫ్
స్వరగతులు మరియు జయ నారసింహా
రచన: వైబోయిన
సత్యనారాయణ
పేజీలు: 138, వెల: రూ. 150
ప్రతులకు:
ఫోన్: 94903 68609
చురకలు
రచన: కొండలరావ్ అడ్డగళ్ళ
పేజీలు: 88, వెల:రూ. 149
ప్రచురణ: అచ్చంగా
తెలుగు ప్రచురణలు
ప్రతులకు:
ఫోన్: 85588 99478
జవరాలు (కవిత్వం)
రచన: డాక్టర్
కావాడి ఎల్లయ్య
పేజీలు: 108, వెల: రూ. 100
ప్రచురణ: పాలపిట్ట ప్రచురణలు
ప్రతులకు:
ఫోన్: 98487 87284
కరోనాపై జయం మనదే
రచన: వేముల కోటయ్య
పేజీలు: 56, వెల: రూ. 30
ప్రతులకు:
ఫోన్: 94414 55261
సతతం హరితం
రచన: నాగిళ్ళ రవీందర్
పేజీలు: 48
వెల: రూ. 75
ప్రతులకు: ఫోన్: 98498 49384
-చంద్ర ప్రతాప్ కంతేటి , 8008143507