కొవిడ్ ఉనికిలోకి వచ్చి ఏడాది దాటిపోయినా, దానికి సంబంధించిన పరీక్షలు ఇప్పటికీ ప్రహసనంగానే ఉన్నాయి. కొన్నిసార్లు విపరీతమైన సమయం తీసుకుంటున్నాయి, ఇంకొన్నిసార్లు పేదవాడికి అందనంత ఖర్చవుతున్నది. ఇంత ఇబ్బంది తర్వాతకూడా వాటి ఫలితాల విషయంలో కొంత సందేహం ఉంది. ఇప్పుడీ సమస్యలు తీరబోతున్నాయని ఇలినాయిస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అంటున్నారు. ‘గ్రాఫేన్’ అనే పదార్థాన్ని ఉపయోగించి అయిదు నిమిషాల్లో కరోనా వైరస్ను గుర్తించగలమని కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. ఈ గ్రాఫేన్ అతి పలుచటి పదార్థం. చాలా గట్టిగానూ ఉంటుంది. ఒక పోస్టల్ స్టాంపులో వెయ్యో వంతు సన్నగా ఉండే గ్రాఫేన్ పొరమీద కొవిడ్ యాంటీబాడీని కనుక ఉంచితే, దానిమీద మనిషి ్త లాలాజలం పడినప్పుడు, అతనిలో వైరస్ ఉంటే ఒకలాగా, లేకుంటే మరొకలాగా స్పందిస్తుంది. సాధారణ కరోనా వైరస్ మాత్రమే కాకుండా. అందులోని వేర్వేరు వేరియంట్లనుకూడా అది గుర్తించగలదు. ఈ పరీక్షతో కొవిడ్ను చిటికెలో, చవకగా పసిగట్టేయవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. త్వరలోనే దీన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం కూడా తీవ్రంగానే చేస్తున్నారు.