కర్నూలు, జూన్ 28:తొలికరి తర్వాత వర్షాలు కురుస్తుండటంతో స్థానికులంతా వజ్రాల వేటలో బినిమగ్నమయ్యారు. ఒక్క వజ్రం దొరికితే చాలు లక్షాదికారి అవ్వొచ్చనే ఆశతో గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరికి వజ్రాలు దొరికాయి. తాజాగా కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ మహిళా కూలీకి ఆదివారం వజ్రం దొరికింది. అదే గ్రామానికి చెందిన మరో వ్యాపారి రూ.6 లక్షలకు దాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. స్థానికులే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చే వజ్రాన్వేషకులతో జొన్నగిరి పొలాలు కిటకిటలాడుతున్నాయి.