మహబూబ్నగర్ : జిల్లా కేంద్రంలోని రాజ్ వీర్ ఇండస్ట్రీలో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వేతన బకాయిలను చెల్లించకుండా కంపెనీ యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తున్నది. సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్కడకు చేరుకొని కార్మికులతో మాట్లాడి వారికి అండగా నిలిచారు.
కార్మికుల సమస్యలపై రాజ్ వీర్ ఇండస్ట్రీ యాజమాన్యంతో మాట్లాడి వారికి చెల్లించాల్సిన వేతనాలు, బకాయిలను వెంటనే విడుదల చేసేలా కంపెనీ యజమానులను ఒప్పించారు. అలాగే కార్మికులకు ఎలాంటి అన్యాయం జరిగిన సహించేది లేదని కంపెనీ యజమానులకు మంత్రి తేల్చిచెప్పారు.
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కార్మిక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ వెంకటరావుతో మాట్లాడి కార్మికులకు న్యాయం చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా కార్మికులకు అండగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
భూమికి బరువయ్యేంత పంట పండిస్తాం : మంత్రి హరీశ్ రావు
దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్ల పంపిణీ
ఎంపీ వెంకటేష్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
ఐసోలేషన్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
200 కోట్ల డాలర్లు విరాళం ఇచ్చిన జెఫ్ బెజోస్ మాజీ భార్య