తిరుపతి,జూన్ 16: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియనున్నది. 2019 ఎన్నికల సమయంలో అప్పటికే ఒంగోలు ఎంపీగా ఉంటూ..ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన సీఎం జగన్ బాబాయ్ సుబ్బారెడ్డికి తిరిగి ఎంపీ సీటు కాదని టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాగంటి శ్రీనివాసులరెడ్డికి కేటాయించారు. దాంతో అప్పట్లోనే బాబాయి సుబ్బారెడ్డి కినుక వహించారు. దీంతో అధికారంలోకి రాగానే టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తాననే జగన్ హామీతో మెత్తబడ్డారు. అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పినట్లుగా సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి అప్పగించారు సీఎం జగన్. సుబ్బారెడ్డి 2019 జూన్ 21న టీటీడీ ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఈ నెల 21వ తేదీతో రెండేండ్లు పూర్తి కానున్నది. అయితే టీటీడీ కి జగన్ కొత్తచైర్మన్ ను నియమిస్తారో… లేదంటే సుబ్బారెడ్డినే కొనసాగిస్తారో వేచిచూడాలి.