ముంబై: బ్లాక్ ఫంగస్ ఔషధం కేటాయింపులో ఏ రాష్ట్రంపై ఎలాంటి వివక్ష లేదని కేంద్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు బుధవారం తెలిపింది. ముకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే యాంఫోటెరిసిన్ బిని అవసర, ఆధారిత ప్రతిపాదితన కేటాయిస్తున్నామని చెప్పింది. దీని కేటాయింపులో మహారాష్ట్రతో సహా ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపలేదని వెల్లడించింది. యాంఫోటెరిసిన్ బి కొరత ఉన్నప్పటికీ మహారాష్ట్రకు యాంటీ ఫంగల్ మందుల కేటాయింపు క్రమంగా ఉన్నదని అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ బాంబే హైకోర్టుకు తెలిపారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లేవనెత్తిన డిమాండ్లను నెరవేర్చడానికి కేంద్రం తన వంతు ప్రయత్నం చేస్తునన్నదని చెప్పారు. యాంటీ ఫంగల్ డ్రగ్ సమాన పంపిణీ విధానంపై దాఖలైన పలు ప్రజా వ్యాజ్యాలపై హైకోర్టు గతంలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం తరుఫున బధవారం అనిల్ సింగ్ సమాధానమిచ్చారు.