హైదరాబాద్ : కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పలుచోట్ల ఆదివారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, రుద్రంగి మండలాలతోపాటు మానకొండూర్, జమ్మికుంట, శంకరపట్నం, ధర్మపురి మండలాల్లో ఈదురుగాలులతో వర్షం దండికొట్టింది. లోతట్టు ప్రాంతాలు వరద నీరు చేరి జలమయంగా మారాయి. వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వర్షం రాకతో సాగు పనులు చేపట్టేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.