న్యూఢిల్లీ: కరోనా వైరస్ నుంచి కోలుకున్న భారత ఫుట్బాల్ స్టార్ సునీల్ ఛెత్రీ జట్టుతో కలిశాడు. 2022 ప్రపంచకప్, 2023 ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనేందుకు 28 మంది సభ్యుల భారత జట్టు బుధవారం దోహా బయలుదేరింది. ఛెత్రీ నాయకత్వంలో వచ్చే నెల 3న ఖతార్తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత జట్టు అప్పటి వరకు బయోబబుల్లో ఉండనుంది. ఈ పర్యటనలో భారత్.. ఖతార్తో పాటు బంగ్లాదేశ్ (జూన్ 7), ఆఫ్ఘనిస్థాన్ (జూన్ 15)తో తలపడనుంది.