న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు ముందు ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్ తనకు కీలకమని దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ అంది. కరోనా వైరస్ విజృంభణతో పలు టోర్నీలు ఇప్పటికే రద్దయిన నేపథ్యంలో విశ్వక్రీడలకు ఆసియా టోర్నీని సన్నాహకంగా భావిస్తున్నట్లు మేరీ పేర్కొంది. ఈనెల 24 నుంచి దుబాయ్ వేదికగా మొదలయ్యే ఆసియా చాంపియన్షిప్లో భారత్ నుంచి మహిళల విభాగంలో సిమ్రన్జిత్కౌర్(60కి), లవ్లీనా బోర్గోహెయిన్(69కి), పూజా రాణి(75కి)తో కలిసి మేరీకోమ్(51కి) బరిలోకి దిగుతున్నది. ఇప్పటికి ఏడుసార్లు ఆసియా టోర్నీలో పోటీపడ్డ ఈ మణిపూర్ ఆణిముత్యం ఐదుసార్లు పసిడి పతకాలతో మెరిసింది.